ఫోటోగ్రఫీ ప్రియులకోసం 'మేళాక్షణాలు' పేరిట పోటీ
కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆధ్వర్యంలో నిర్వహణ..
సంప్రదాయ ఉత్సవాల, మేళాల ప్రాముఖ్యతను గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో వివరించారు.
ఫొటోగ్రఫీ పోటీలో విజేతలకు ఫైనల్ అవార్డులు, నెలవారీ అవార్డులు ప్రదానం చేస్తారు.
నెలవారీ అవార్డుల విభాగంలో ప్రథమ బహుమతిగా రూ. 10,000; ద్వితీయ బహుమతిగా రూ. 7,500, తృతీయ బహుమతిగా రూ. 5,000.
ఫోటోగ్రఫీ అభిమానులకోసం కోసం 'మేళా క్షణాలు' పేరిట ఛాయాగ్రహణం(ఫోటోగ్రఫీ)లో ఒక పోటీని భారత ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. సంప్రదాయ ఉత్సవాల ప్రాముఖ్యతను గురించి ‘మన్ కీ బాత్’ 91వ విడత ప్రసంగం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరించారు.
ఫోటోగ్రఫీ పోటీలో పాల్గొనాలనుకునే వారందరూ ఏదైనా సంప్రదాయ ప్రదర్శన, ఉత్సవం, మేళాలో గడిపిన క్షణాలనుంచి తాము తీసిన ఉత్తమమైన ఛాయాచిత్రాలను (ఫొటోలను) ఈ పోటీకి పంపించుకోవచ్చు. తద్వారా, వారు నగదు బహుమతులను, ప్రోత్సాహక పురస్కారాలను గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు.
ఈ పోటీలో విజేతలకు ఫైనల్ అవార్డులు, నెలవారీ అవార్డులు అందుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్ అవార్డుల్లో ప్రథమ బహుమతిగా రూ. 1,00,000, ద్వితీయ బహుమతిగా రూ. 75,000, తృతీయ బహుమతిగా రూ. 50,000 ప్రదానం చేస్తారు. ఇంకా,. నెలవారీ అవార్డుల ప్రథమ బహుమతిగా రూ. 10,000, ద్వితీయ బహుమతిగా రూ. 7,500, తృతీయ బహుమతిగా రూ. 5,000 ఇస్తారు.
ఫొటోగ్రఫీ పోటీలో పాల్గొనడానికి, దిగువన ఇచ్చిన ఈ ఫారమ్ను నింపాల్సి ఉంటుంది:
https://docs.google.com/forms/d/1Tkb-t08neMAb6EOHZGYlM5CfqfHMcDk8hVikPQye-Bs/edit?pli=1
0 కామెంట్లు