.నగరం లోని వి.ఆర్.సి మైదానం లో కార్తీక మాసం లక్ష దీపత్సవం ను ఈ రోజు ప్రారంభించారు. వి.పి.ఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యలో స్పటిక లింగ ఈశ్వరుని రుద్రాక్షలు తో అలంకరించారు.వేద మంత్రాలతో,మంగళ వాయిద్యాల తో ,శివుని,గోమాత పూజను చేశారు. 11,12,13 తేదీల వరకు ఉంటుందన్నారు . సంస్థ ఛైర్మన్ వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా పూజ చేసారు.శరీర దోషాలు పోవాలంటే ఇలాంటి పూజలు చేయాలని సిద్దేశ్వర స్వామి తెలిపారు.