ప్రయోక్త :-  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ,  సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమంగా తరలించిన గ్రావెల్ నిర్వహకులను అరెస్టు చేసి వారి లైసెన్స్లు రద్దు చేయాలి

వారికి సహరించిన ఇరిగేషన్ ఈ ఈ ను మైనింగ్ డి డి ను సస్పెండ్ చేయాలి:ప్రజాసంఘాల డిమాండ్

గత వారం రోజులు గా సర్వేపల్లి రిజర్వాయర్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమాల అవినీతి పై ప్రజా సంఘాల ఆద్వర్యంలో వెన్నెలకంటిబ రాఘవయ్య భవన్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రజాసంఘాల నాయకులు పి.టోని బాబు మాట్లడుాతుా సర్వేపల్లి రిజర్వాయర్ లో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోకుండా అధికారులు అక్కడ జరిగే పరిణామాలను పట్టించుకోకుండా  నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం హాస్యస్పదంగా ఉందని ఈ జిల్లాలో 

అధికార యంత్రాంగం ఉందో లేదో అర్దంకావడం లేదని 

ఎద్దేవా చేశరు.

బాధ్యతాయుతంగా  వ్యవహరించాల్చిన అధికార 

ప్రతిపక్ష పార్టీలు నువ్వు దోంగ అంటే నువ్వే దొంగ అని గగ్గోలు పెడుతుా అసలు దొంగలు పారిపోయేలా ప్రవర్తిస్తుా జిల్లా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్వక్తం చేశారు.

ఇంత జరుగుతున్న ఇరిగేషన్ మైనింగ్ డిపార్ట్మెంట్ లొ ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు.దీనికి ప్రదాన భాద్యులైన ఇరిగేషన్ ఈ ఈ , మైనింగ్ డి డి లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.రేపు ప్రజాసంఘాల ఆద్వర్యంలో సర్వేపల్లి రిజ్వరాయర్ కంటేపల్లి అటవీ    ప్రాంతాల లో నిజ నిర్దారణ కమిటీ పర్యటిస్తుందని తెలిపారు.

పై కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎల్లంకి. వెంకటేశ్వర్లు,పి.ఆదిత్య సాయి, పి.లీలా మెాహన్,కన్నా.వెంకట్,శ్యామ్,హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.