ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 అనుసరించి ప్రభుత్వ గెజిట్ నెంబర్ 1440 విడుదల ద్వారా షాపులు వర్తక వ్యాపార సంస్థలు అంగళ్ళు 2022 నవంబర్ 1 నుంచి 365 రోజులుఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరాటంకంగా తమ తమ వ్యాపారాలు చేసుకోవచ్చని ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు అందినట్లు ఆంధ్ర ఛాంబర్ కామర్స్ సభ్యులు కే.వి చలమయ్య తన ప్రకటనలో తెలియజేశారు ఈ జీవో అమలు ఐదు సంవత్సరాల వరకు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు వర్తక వ్యాపార సంస్థలు తమ తమ వ్యాపారకలాపాలను ప్రభుత్వం పేర్కొన్న సమయాలలో చేసుకోవచ్చని చాంబర్ సభ్యులు తెలిపారు ప్రభుత్వం ద్వారా కల్పించిన ఈ సదుపాయాన్ని వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవాలని
కోరారు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆంధ్ర ఛాంబర్ కామర్స్ ధన్యవాదాలు తెలియజేశారు కేవీ చలమయ్య ఆంధ్రప్రదేశ్ చాంబర్ కామర్స్ సభ్యులు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా