ప్రయోక్త:- అగ్ర వర్ణాల పేద మహిళలకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ "ఈబీసీ నేస్తం" పధకం... 2021-22 సంవత్సరం ఏప్రిల్ మాసం నుండి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం ఆ గ్ర వర్ణాల లోని ఆర్థిక వెనుక బాటు కలిగిన "బ్రాహ్మణ, వైశ్య, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం తదితర మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం " ఈబీసీ నేస్తం" పధకం ద్వారా 45 సంవత్సరముల నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు లోపు మహిళలకు ప్రతీ సంవత్సరం రు. 15,000/- లను అందించబోతోంది ఈ పధకము నకు కావలసినవి 1. ఆదార్ కార్డు జిరాక్స్ 2. రైస్ కార్డు జిరాక్స్ 3. పాస్ పోర్ట్ సైజు ఫోటో ఒకటి 4. బ్యాంకు బుక్ మొదటి పేజి జిరాక్స్ 5. కుల ద్రువీకరణ పత్రం జిరాక్స్ 6. EWS (ఎకనామికల్లి వీకర్ సెక్షన్) సర్టిఫికేట్ జిరాక్స్ దయచేసి అగ్ర వర్ణాల లోని ఆర్థిక వెనుక బాటు కలిగిన మహిళలు అందరు ఈ పధకము నకు దరఖాస్తు చేసుకోగలరని మనవి మీ దగ్గర లోని మీ సచివాలయం లో పైన తెలిపిన సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తు చేసుకోగలరు
0 కామెంట్లు